మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి మధు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆత్మకూర్ మండలంలో గూడెప్పాడ్ విగ్రహం వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం డా బీ ఆర్ అంబేద్కర్ కృషిని, గౌరవించుకుంటూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టడం జరిగిందనీ
అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను బిజెపి ప్రభుత్వం ‘పంచతీర్థాలుగా’ వాటిని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలుగా తీర్చిదిద్ది దేశ ప్రజలంతా ఆ ప్రాంతాలను సందర్శించి నివాళులర్పించే విధంగా అభివృద్ధి చేశామని
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందనీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందినీ. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం బిజెపి పునరంకితమై పనిచేస్తుంది
అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పెంచికలపేట, నీరుకుల్ల, పెద్దాపూర్, అక్కంపేట, గ్రామాలలో బిజెపి కార్యకర్తలు జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి కిసాన్ మోర్చా నియోజకవర్గ కో కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి మాజీ అధ్యక్షులు సదానందం బీజేవైఎం అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, గంట రాహుల్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ముద్దెర గోపాల్, బూత్ అధ్యక్షులు సునీల్ రెడ్డి, కాడబోయిన సునీల్, లకిడి నాగరాజు, కోరుకొప్పుల ప్రశాంత్, రాచర్ల నరేష్, మేక కృష్ణారెడ్డి, బలభద్ర సాయి రాం, కందకట్ల దిలీప్, బలభద్ర భిక్షపతి, కౌటం రామ్మోహన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: