ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్ గా డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి బుధవారం నాడు అధికారికంగా తన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి యూనివర్సిటీ సిబ్బంది తో ముచ్చటించారు . నూతన వీసీ కి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్ ,జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ , అడ్మిషన్ కమిటీ మెంబెర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్ కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలిద్ ,సిబ్బంది అభినందనలు తెలిపారు.

Post A Comment: