హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి బుధవారం పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అదేవిధంగా గూడూరు లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: