నిర్మల్,నవంబర్,21(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)దోషులకు శిక్ష పడేలా చేసి చిన్నారి బాబుకు న్యాయం చేయండి,ఎస్పీ కి విజ్ఞప్తి చేసిన పోగుల లత కుటుంబీకులు,ప్రజా సంఘాలు.ఈసమాజంలో జరుగుతున్న వరకట్న హత్యలను,వేధింపులను అరికట్టాలని పోగుల లత న్యాయ పోరాట కమిటి ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిలకు,లత కుటుంబీకులు,మహిళా,ప్రజా,హక్కుల సంఘాల నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పోగుల(సంద)లత నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటలో ఈనెల 8న హత్య జరిగిన సంగతి తెలిసిందే..ఈ హత్యపై సమగ్ర విచారణ చేపట్టి,దోషులకు చట్టపరంగా శిక్ష పడేలాచేసి,లత కొడుకు అయిన 18 నెలల చిన్నారి బాబుకు న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ ఎ.గంగారెడ్డిలకు వేర్వేరుగా ప్రత్యేక వినతి పత్రాలు అందజేశారు.నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేటలో నవంబర్ 8న జరిగిన అదనపు వరకట్న వేధింపుల హత్యలో మరణించిన పోగుల లత కేసుపట్ల పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి చట్ట పరంగా సరైన న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.పోగుల లత వివాహం జరిగిన నుండి హత్య జరిగిన రోజువరకు చోటు చేసుకున్న సంఘటనలు,అదనపు వరకట్న వేధింపులు,లత హత్యపై గల అనుమానాలను,ఇతరత్రా విషయాలను వినతి పత్రాల ద్వారా జిల్లా ఎస్పీకి వివరించారు.ఇలాంటి వరకట్న హత్యలు,వేధింపులు.బాల్య వివాహాలు,మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకోకుండా చూడాలని పోగుల లత న్యాయ పోరాట కమిటి ఎస్పీ డా.జానకి షర్మిల ను కోరారు.లత హత్యనే ఈ రాష్ట్రంలో చివరి హత్య కావాలని,ఇకముందు ఇలాంటివి రాష్ర్టవ్యాప్తంగా మరెక్కడా కూడా జరుగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల
మాట్లాడరు.నేను కూడా సాటి మహిళనే..అని,ఇలాంటి సంఘటనలు ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్య తీసుకుంటామని బాధ్యత మాపై ఉందని ఈకేసు విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని జిల్లా ఎస్పీ తెలిపారు ఒక మహిళగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను,అక్రమాలను అరికట్టి సమాజానికి నావంతు సేవ చేయాలనే తపనతోనే ఉద్యోగంలో చేరానని జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల తెలుపడం మాకు గర్వంగా ఉందని మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.నిర్మల్ జిల్లా ఎస్పీని కలిసిన వారిలో పోగుల లత న్యాయ పోరాట కమిటి కన్వీనర్ అయిన ఐద్వా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్గొండ పద్మ,కో-కన్వీనర్లు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాల్లు కే.శ్రీదేవి,ఒటారికారి శ్రీదేవి,సుశీల,పోగుల మల్లేశ్వరి,జల,పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి,జై భారత్ సంస్థ నాయకురాలు పద్మ,రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముని మడుగుల మల్లన్న,మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దేవి సత్యం,భారత నాస్తిక సమాజం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ బొమ్మేన రాజ్ కుమార్,ఖానాపూర్ బానాస,ప్రజా సంఘాల నాయకులు బొమ్మేన రాకేష్,రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డా.యం.గజ్జారాం,నిర్మల్ జిల్లా సామాజిక కార్యకర్త బాల్నేని అజయ్,విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య,నాయకులు పుట్ట రాజన్న,తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటి రాష్ట్ర స్టీరింగ్ కమిటి సభ్యులు,జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం రాజ మల్లయ్య,తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి,దళిత లిబరేషన్ ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ రామిళ్ళ బాపు,తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, దేవి సత్యం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు,పోగుల తిరుపతి,ఓరగంటి రమేష్,రంగు మల్లేష్,కానగంటీ నర్సయ్య,పోగుల శ్రీను,తంగెళ్ళ చంద్ర మౌళి,వొడ్నాల రాజేశం,వొడ్నాల శంకర్,సాతల్ల రమేష్, కాసారపు గణేష్ తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: