హన్మకొండ ;
హనుమకొండలో వయో వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారానికి నిర్ణీత గడువులోగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం పరిధిలో వచ్చిన కేసుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ వయో వృద్ధులకు సంబంధించిన కేసులను అధికారులు పరిష్కరించాలని అన్నారు. ట్రిబ్యునల్ లో నమోదైన కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కేసుల పరిష్కారంలో భాగంగా ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వయోవృద్ధులకు సంబంధించిన కేసులను జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆర్డీవోల పరిధిలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.
హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రవికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: