ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
వర్షాకాలం నేపద్యం లో జిల్లా పరిధి లోగల పలు లోతట్టు ప్రాంతాల తో పాటు నాలాలను కలెక్టర్ కమీషనర్ అశ్విని తానాజీ వాకడే హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా లతో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తితే
ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పర్యటన నేపద్యం లో.ఎస్ బి హెచ్ కాలనీ వడ్డేపల్లి చెరువు జవహర్ కాలనీ సరస్వతి నగర్ అంబేద్కర్ భవన్ రాజాజీ నగర్ ప్రెసిడెన్సీ స్కూల్ నయీం నగర్ బొక్కల గడ్డ అజర హాస్పిటల్ కల్వర్టు భద్రకాళి మత్తడి సమీపం లో క్షేత్ర స్థాయి లో పరిశీలనలు జరిపారు.
నగరం లోని ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చూడాలని అవసరం మేరకు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడం డిసిల్టింగ్ ప్రక్రియ ను చేపట్టడం కచ్చా కాలువలు తీయడానికి సిబ్బందిని ముందస్తు గా అందుబాటులో ఉంచుకోవాలని అత్యంత ప్రమాదకరం గా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు)ఏర్పాటు చేసి నీటిని అందులోకి పంపే ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భం గా అధికారులకు సూచించారు.
ఇట్టి కార్యక్రమం లో ఎస్ ఈ కృష్ణారావు సి ఏం హెచ్ ఓ డా.రాజేష్ సిటీ ప్లానర్ వెంకన్న ఆర్ డి ఓ దత్తు బల్దియా ఈ ఈ రాజయ్య ఇరిగేషన్ డి ఈ హర్ష వర్ధన్ బల్దియా డి ఈ లు రవి కుమార్ సంతోష్ బాబు ఏ ఈ లు హరికుమార్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: