సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోందని సోమవారం స్థానికులు ఆరోపించారు. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారుల తీరు తమకేమీ పట్టదన్నట్లు ఉందన్నారు. ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి, నంగునూరు మండల కేంద్రంతో పాటు ఖాతా, అక్కెనపల్లి, ఘణపూర్ గ్రామాల్లోని మోయతుమ్మెద వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Post A Comment: