ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం తనిఖీ చేశారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
కాగా సాధారణ తనిఖీలలో భాగంగా కలెక్టర్ పరిశీలించి స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, తదితర ఏర్పాట్లను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: