ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ హనుమకొండ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. జిల్లాలో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం 72.16% నమోదయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ అనంతరం పోలీసు భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు, ఇతరు ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులు, సిబ్బంది హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్ కేంద్రానికి తీసుకువచ్చారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వారిగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది అప్పగించారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులు సిబ్బంది సమష్టి కృషితో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
Post A Comment: