ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఈ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అందజేశారు.
హనుమకొండ జిల్లాకు సంబంధించి 43483 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి శ్రీనివాసరావు, ఎ. విద్యాసాగర్, రావు అమరేందర్ రెడ్డి, ఎం. మణి, బీ. ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: