ఏబీఎస్ఏఫ్ కెయూ ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్...
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 6న నిర్వహించే డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏ బీ ఎస్ ఏఫ్ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కెయూ వీసీ తాటికొండ రమేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వేసవిలో ఎండ తివ్రత ఎక్కవగా ఉన్నందున విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఎండాకాలంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే వడ దెబ్బకు గురికావడం జరుగుతుందనీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 6నుండి నిర్వహించే డిగ్రీ పరీక్షలు వాయిదా వేయకపోతే విద్యార్థులతో కలిసి వీసీ ఛాంబర్ ముట్టడిస్తాం అని ఏ బీ ఎస్ ఏఫ్ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఏఫ్ నాయకులు దార సురేష్ నవీన్ సాయి నరేందర్ తదితరులు పాల్గొన్నారు....
Post A Comment: