ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల( ఈవీఎంల) గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ( ఈవీఎం )ప్రదర్శన కేంద్రం వద్ద రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద వినియోగిస్తున్న ఈవీఎం పనితీరు గురించి , బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ పనితీరు గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఓటు వేసినప్పుడు ఈవీఎం పనితీరు గురించి ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద పలువురికి ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు.  

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై. వి.గణేష్, ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా, సామాజిక వేత్త ఇ. వి. శ్రీనివాస్ రావు, హన్మకొండ తాసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, అధికారులు సురేష్ కుమార్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: