ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈనెల 8 న పెగడపల్లి ప్రభుత్య గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో హైదరాబాద్ యశోద హాస్పిటల్ మలక్ పేట్ కు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వైద్య బృందం. అలాగే మన భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్లు, మరియు పారామెడికల్ సిబ్బంది ఈ మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అవసరమైనవారికి అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ,రోగులకు ఉచితంగా మందుల పంపిణీ జరగనుంది. కావున అడవిముత్తారం, పలిమెల మరియు భూపాలపల్లి మండలాలకు చెందిన మారుమూల అటవీ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పి కిరణ్ ఖరే కోరారు.
Post A Comment: