మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బోయిని యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఆనంద్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, ఉపాధ్యక్షులుగా సాయిలు, రమేష్ ,కార్యదర్శిగా ప్రేమ్ కుమార్, కోశాధికారిగా యాదాగౌడ్ ,సమాచార కార్యదర్శిగా దుర్గయ్య,
కార్యవర్గ సభ్యులుగా పవన్, సుధాకర్, లింగం,
సలహాదారులుగా రాములు , కొండి శ్రీనివాస్,రాథోడ్ రాజు నాయక్ లు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో మండలంలో 42 మంది విలేకరులు ఉండగా 33 మంది ఈ ఎన్నికలకు హాజరయ్యారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల విలేకరులు శాలువాలతో ప్రెస్ క్లబ్ నందు సన్మానం నిర్వహించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొయిని యాదయ్య మాట్లాడుతూ విలేకరుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు కార్యాచరణ చేపట్టనున్నట్టు త్వరలో దీని పై విలేకరులతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Post A Comment: