కరీంనగర్ : మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కొత్తపల్లి మండలం చింతకుంట గురుకులంలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న మల్యాల మండలానికి చెందిన అక్షిత (17) పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తోటి విద్యార్థులతో ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి 7 గంటలకు స్నేహితులు భోజనానికి వెళ్లిన సమయంలో హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Post A Comment: