ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. నిరుపేద విద్యార్థుల కోసం నోట్ బుక్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. నిరు పేద విద్యార్థుల కోసం నోట్ బుక్స్ ను అందజేసినందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ. వి. శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
Post A Comment: