ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్ , డి.ఈ.ఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్ధుల అటెండెన్స్ , లిటరసీ రేట్ 100 శాతం వచ్చేలా ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అన్నారు. క్యాంపైన్ కోసం యన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పట్లా ప్రతేక శ్రద్ధ తప్పనిసరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని సక్రమంగా వినియోగించి, ప్రతి ఒక్కరి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు దారి వెయ్యాలని అన్నారు.

( ఎఫ్.ఎల్.యన్ ) ఫంక్షనల్ లిటరసీ న్యుమెరసీ లో భాగంగా ముందుగా తొలి మెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి 1-5వ తరతి విద్యార్థి చదవడం , రాయడం , మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన లక్ష్య కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఔట్ గోయింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించాలన్నారు.

ప్రతి విద్యార్థికి పప్రభుత్వం అందించే ఉచిత టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ , స్టడీ మెటీరియల్స్ అందించాలని,   ఎఫ్.ఏ  ( ఫార్మటివ్ అసెస్మెంట్ ) , ఎస్.ఏ ( సమ్మేటివ్ అసెస్మెంట్ ) లను ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. 10వ  తరగతి బోర్డ్ పరీక్షలు రాసే విద్యార్ధులకు అదనపు స్టడీ అవర్స్ను నిర్వహించి , ఎప్పటికెప్పుడు టేస్ట్ లను నిర్వహించి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచేలా చేయాలన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతు ఎప్పటికప్పుడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్లతో రివ్యూ , ఉపాధ్యాయుల టీచింగ్ పై సమావేశాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు.

కొన్ని పాఠశాలల్లో శానిటరీ, ,త్రాగు నీరు , స్కావెంజర్ కార్మికుల అవసరం ఉందన్నారు.     

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్వో వై. వి. గణేష్, డి.ఈ.ఓ. అబ్దుల్ హై ,  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: