పేద్దపల్లి:మంథని:నవంబర్1:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):మంథని నియోజకవర్గం తోటగోపయ్యపల్లె గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌,బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు.ఇటీవలి కాలంలో మంథని,ముత్తారం,మల్హర్‌,కాటారం,మహదేవ పూర్,మహముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.తాజాగా మంథని పట్టణంలోని రాజగృహలో మంథని మండలం తోటగోపయ్యపల్లె గ్రామానికి చెందిన 50 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం భిఆర్ఎస్ లో చేరారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గర్రెపల్లి సత్యనారాయణగౌడ్,విద్యానగర్ కు చెందిన యూత్ అధ్యక్షుడు కేకొండ నరేంద్ర చారి 50 మందితో చేరారు,మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది,సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవకార్యక్రమాలకు ఆకర్షితులై అండగా నిలువాలని నిర్ణయించుకొని బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.నియోజకవర్గ అభివృధ్ది,ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని ఈసందర్బంగా వారు స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం,మధుకర్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: