పెద్దపల్లి,కాటారం,మంథని,నవంబర్,18(మేడిగడ్డటీవీన్యూస్) పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపుకోసం భారత రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంథని నియోజకవర్గంలో ఆదివారం నాడు పర్యటించనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆమె సాయంత్రం నాలుగు గంటలకు రామగిరి మండలం సెంటినరీకాలనీలోని వాణి సెకండరీ పాఠశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.మంథని నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంథని టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కోరారు.కాగా శనివారం గోదావరిఖని సబ్ డివిజనల్ ఏసిపి తుల శ్రీనివాసరావు మంథని సీఐ సతీష్ తో కలిసి సెంటినరీ కాలనీలోని బహిరంగ సభ పరిసరాలు,బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

                        

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: