రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ మేడిపల్లి గ్రామంలో ఎన్టిపిసి పట్టణ రజక సేవా సంఘం ప్రెసిడెంట్ పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, మడేలేశ్వర స్వామి బోనాల ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మేడిపల్లి గ్రామ రజక సంఘం,కుల బాంధవులు మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి బయలుదేరి పోచమ్మ తల్లికి మడేలేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టిపిసి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్, నస్కూరి భూమయ్య, నస్పూరి శ్రీనివాస్, నస్పూరి సంతోష్, కొత్తకొండ లక్ష్మణ్, దొడ్డిపట్ల బాపన్న, పూసాల సత్యనారాయణ, పెనుగొండ సత్తయ్య, దురుశెట్టి కిష్టయ్య, జనగామ శంకర్, పారుపెల్లి రాజయ్య, పారుపెల్లి వెంకటేష్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: