మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించి దీక్ష చేపట్టిన BSP పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్. ఈ సందర్భంగా *గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంతర్గాం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ సిబ్బంది చేస్తున్న పోరాటానికి బీఎస్పీ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, గ్రామ పంచాయతీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి కనీస వేతనం ₹.19,500/- అమలు చేయాలని, వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని" అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ అంతర్గాం మండల నాయకులు చిలుక రాంమూర్తి, ఏ.రాజేందర్, మహ్మద్ పాషా, బీ.శ్రీనివాస్ లతో పాటు అంతర్గాం మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అధ్యక్షులు తూడూరి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి మాలెం సురేష్, కొండ కరుణాకర్ రావు, తమ్మనవేని శంకర్, రాపోలు విద్యాకర్ రావు, తిగుట్ల దేవరా, కండె మొండయ్య, ఉప్పులేటి మధుకర్, కాంపెల్లి శంకర్, కొల్లూరి మల్లేష్, చిలుక మల్లయ్య, ఉప్పులేటి హనుమంతు లతో పాటు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Post A Comment: