ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పెండింగ్లో వున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (కోఆర్డినేషన్)ప్రదీప్ కుమార్ త్రిపాఠీ అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ మానేజ్మెంట్ గ్రూప్ పోర్టల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ల అన్ని వివరాలను నమోదు చేస్తుంది అని తెలిపారు.రైల్వేలు,రోడ్డు రవాణా, హైవేల నిర్మాణలలో పనులు వేగవంతం చేయాలి అని అన్నారు.చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ పనులు యుద్ధ ప్రతిపదికన పూర్తి చేయాలి అని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ కలెక్టరేట్ నుండి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ రమేష్ కుమార్ జీఎం ఇండస్ట్రీస్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.
Post A Comment: