మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కాళేశ్వరం: ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని, బదిలీపై వెళ్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి దంపతులు, పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఈశ్వరునికి ప్రీతివంతమైన సోమవారం రోజున దర్శించుకొనుటకు ఆలయంకు చేరుకోగా, వారిని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, గర్భాలయంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లకు పాలాభిషేకం పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారి ఆలయంలో అర్చన, దర్శననంతరం ఆలయ ధర్మకర్తలు శ్యాంసుందర్ దేవ్డ, ఆరేల్లి సత్యనారాయణ గౌడ్, కామిడి రాంరెడ్డి, అడప సమ్మయ్య స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సీఐ కిరణ్ కుమార్, కాళేశ్వరం ఎస్ఐ లక్ష్మన్ రావు పోలీసులు పాల్గొన్నారు.
Post A Comment: