పెద్దపల్లి:గోదావరిఖని:జూలై;17:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్,విట్టల్ నగర్ లో మూఢనమ్మకాల పేరుతో ఇరుగు పొరుగు వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొందరు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే గోదావరిఖని విట్టల్ నగర్ 13వ వార్డులో నివసిస్తున్న ఇసంపెల్లి లక్ష్మి, ఇసంపెల్లి లావణ్య లు వారి వీధిలో ఉన్న నాడం స్వప్న శంకరయ్య వారి ఇంటి ముందు గత కొన్ని రోజుల నుండి నిమ్మకాయలు,పిండి బొమ్మలు,పసుపు కుంకుమ,కోడి గుడ్లు లాంటి వస్తువులు పెట్టి, ఆ ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,ఆదివారం రాత్రి వనం లక్ష్మీనరసయ్య ఇంటి ముందు గల ఓ వ్యక్తి స్వప్న ఇంటి ముందు నిమ్మకాయ పసుపు కుంకుమ పెడుతుండగా చూసి పట్టుకొనగా,ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడని, వెంటనే 100 డయల్ చేయగా పోలీసులు వచ్చి ఉన్న సన్నివేశాన్ని చూసి పిలిచి అడగగా డోరు తీయకుండానే తను పెట్టలేదని తడబడినాడనీ,అది చూసి పోలీసులు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయమని తెలుపగా మరుసటి రోజు ఉదయం ఆ ఏరియా ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నామని కావున వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని,విట్టల్ నగర్ బస్తీ వాసులు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దీంతో స్పందించిన వన్ టౌన్ సిఐ విచారణ చేపట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్టు!.కాలనీవాసులు తెలిపారు...


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: