మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి రూరల్: టేకుమట్ల మండలంలోని సమీప పలు గ్రామాల నుండి ఈరోజు యువకులు 7200 తీన్మార్ మల్లన్న టీం లోకి అత్యధిక సంఖ్యలో చేరికలు జరిగినవి.టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలలో గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది.వారందరికీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువాలు కప్పి 7200 టీం లోకి ఆహ్వానించారు.తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్టిఆర్ 7200 తీన్మార్ మల్లన్న టీం లక్ష్యం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదసాధికులకు సత్వర న్యాయం, రాజకీయ ప్రజా ప్రతినిధులు పనిచేయకుంటే రీ కాల్ చేసే విధానాన్ని అవలంబిస్తుంది కాబట్టి, మల్లన్న టీం లో చేరడం జరిగిందని యువత చెప్పారు. ప్రశ్నించే గొంతు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని ప్రజలకు సౌకర్యవంతమైన పనులను, ఎన్నో సేవా కార్యక్రమాలు తీన్మార్ మల్లన్న చేస్తున్నాడని, అందులో భాగంగా రాజకీయ ఎజెండే ప్రధానంగా భూపాలపల్లి నియోజకవర్గము, తీన్మార్ మల్లన్న టీం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రవి పటేల్ పోటీ చేస్తున్నందున గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీం సభ్యులు ముక్తకంఠంతో హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య సైనికుడిలా పనిచేస్తూ, ఒక్కొక్కరు 100 మందిని తయారు చేయాలని రవి పటేల్ యువతను కోరారు. ఈ చేరికల ముఖ్య కార్యక్రమంలో జిల్లా నాయకులు అంబాల నరసయ్య, గండు కరుణాకర్, భూక్య కిరణ్, చంద్రన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
Post A Comment: