మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పిల్లలు మంచి నడివడిక, సత్ప్రవర్తనతోనే గుర్తింపు పొంది సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే ఆస్కారం ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టిపిసి పర్మినెంట్ టౌన్షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన బాలికల సాధికారత మిషన్ - 2023 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులను ఎంపిక చేసి, పలు రంగాల్లో ఎన్టిపిసి యాజమాన్యం శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ శిక్షణతో పిల్లల్లో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంను బాధ్యతతో ఎన్టిపిసి యాజమాన్యం నిర్వహించడం సంతోషమన్నారు. విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలన్నారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించాలని, ప్రేమతో మాట్లాడాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలు మరింతగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని, ఉన్న ఊరికి, కన్నవారికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణను ప్రతి బాలిక ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే చందర్ ను ఎన్టిపిసి ఈడి సునీల్ కుమార్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: