మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ విచ్చేయడం జరిగినది.
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కార్మికులను ఉద్దేశించి మాట్లడుతూ,
ఎన్ టి పి సి యాజమాన్యంతో కార్మికులు చేసుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో అగ్రిమెంట్లు నెలలు గడుస్తున్న అమలుపరచకపోవడం దారుణమని, ఎన్ టి పి సి యాజమాన్యం కార్మికుల హక్కులను తుంగలో తొక్కి, నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటూ, కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని,
ఇలాంటి విధానాలు సరైనవి కాదని ఎన్టీపీసీ
యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగినది..
ఇకనైనా ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి కార్మికులతో ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్లు వెంటనే అమలుపరచాలని, లేని పక్షంలో కార్మికుల మద్దతుతో సమ్మె బాట తప్పదని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్ టి పి సి పట్టణ అధ్యక్షుడు అసిఫ్ పాషా , ఎం మహేష్, వి సురేష్ ,ఇదునూరి రవి ,నరసయ్య , బీ రాజేష్ ,శ్రీకాంత్ ,మోసిన్, అబ్దుల్లా ,కంకారాజు, టి ప్రకాష్ వారితో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: