మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన నిరుపేదలు పక్షవాతం తో బాధపడుతు పనులు చేసుకోలేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న 40.49 వ డివిజన్ లకు చెందిన బత్తుల శ్రీదర్.ముద్దమల్ల వెంకటేష్ కుటుంబాలకు ప్రతినెల 10 కిలోల బియ్యం అందజేయున్నట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలియజేశారు.
అశోక్ నగర్ కు చెందిన బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ.సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు తలకోటీ రఘు తండ్రి తలకోటీ ఉపేందర్ ఇటీవల మరణించినడం జరిగిందని వారి జ్ఞాపకార్థం ఇరువురికి
పది కిలోల చొప్పున 20 కిలోల బియ్యం అందజేయడం జరిగిందని ఉపేందర్ ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానని ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ తెలిపారు గతంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని నిరుపేద ప్రజలు కాళ్లు చేతులు కోల్పోయి వికలాంగులగా మారిన వారికి సేవా స్పూర్తి ఫౌండేషన్ తరపున సంవత్సర కాలంగా బాధితులకు 10 కిలోల బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తో కుటుంబం కు కొద్దిగా ఆసరా గా ఉంటుందని. పక్షవాతం తో బాధపడేవారికి ఎలాంటి ఆదరణ ఉండదు కాబట్టి వీరికి కూడా సంవత్సరం పాటు బియ్యం పంపిణీ చేయాలని ఫౌండేషన్ సభ్యులు చూసించారని మల్లేష్ తెలిపారు వారి చుచనల ఈమేరకు
ఈ నెల నుండి పక్షవాతంతో బాధపడుతున్న బాధితుల కుటుంబాలకు ప్రతి నెల10 కిలోల బియ్యం అందజేస్తామని సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు ప్రతి నెల ఫౌండేషన్ కు ఆర్థిక సహాయం అందిస్తున్న సభ్యులందరిని
ఈ సందర్భంగా మడిపెల్లి మల్లేష్ అభినందించారు అలాగే ఈనాటి దాత తలకోటీ రఘు యొక్క దాతృత్వనికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో సేవా స్పూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు దాసరి శ్రీనివాస్. జుల వినయ్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: