మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



మహాదేవపూర్: మంథని మండలం,లక్కెపూర్ గ్రామం లోని యువ నాయకులు మేదరవేన రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర,మంథని నియోజక వర్గం ముఖ్య నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు.చివరి మ్యాచ్ లో తోట గోపయ్య పల్లి, లక్కెపూర్ జట్లు తలపడగా విన్నర్ తోట గోపయ్య పల్లి జట్టు కు 5000/- రూ" రన్నర్ లక్కెపూర్ జట్టు కు 2000 రూపాయలను అందించడం జరిగింది.క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సునీల్ రెడ్డి మాట్లాడుతు.. క్రీడాలు మానసిక, శారీరకంగా ఎంతగానో ఉపయోగపడతాయి, యువత చదువుతో పాటు, ఆటలో కూడ రాణించాలి,12 సంవత్సరాలు గా ఈ ప్రాంతం యువత మార్పు కొరకు పరితపిస్తున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నాకు అవకాశం కల్పిస్తే,హైదరాబాద్ తరహాలో మంథని ప్రాంతంలో క్రీకెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తానన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసమే క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో మంథని మండల ఇంచార్జ్ లు చిలువేరి సతీష్,తోట మధుకర్,మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, నాయకులు,కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: