ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను బహిరంగ వేలం ద్వారా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు  ఆధ్వర్యంలో విక్రయించారు. మంగళవారం జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన  కార్యాలయంలో నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో  భూపాలపల్లి జిల్లాతో ఇతర జిల్లా నుంచి దాదాపు 81 బిడ్డర్లు, (వ్యాపారులు) హాజరయ్యి, ఉత్సాహంగా పాల్గొని, రూ. నాలుగు లక్షల 12 వేలు చెల్లించి వాహనాలు తీసుకెళ్లడం జరిగింది.  ఈ వేలంపాటలో ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి  ద్వారా నియమించబడిన వేలం కమిటీ సభ్యులయిన  భూపాలపల్లి, కాటారం  డిఎస్పీలు, ఏ. రాములు, బోనాల కిషన్, ఇన్స్పెక్టర్ లు పెద్దన్న కుమార్, జితేందర్ రెడ్డి, ఎం.టి.ఓ సతీష్ పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: