సంగారెడ్డి పట్టణంలో ద మాస్టర్ మైండ్ పాఠశాలలో 79 వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల చైర్మన్ దార సింగ్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాలలో విద్యార్థులతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు మరియు డ్రాయింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు
పాఠశాల చైర్మన్ దారాసింగ్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహానీయులు పోరాటాలు మరెన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వతంత్ర ఫలాలు చివరి గడపకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది అని అన్నారు మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తితో అన్ని రంగాల్లో సబండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యచరణ మరింత చిత్తశుద్ధితో అమలుచేసి ఫలితాలు సాధించడం ద్వారా మాత్రమే స్వతంత్ర పోరాట త్యాగదనులకు మనం అర్పించే ఘన నివాళి అని తెలియజేశారు
భారత స్వతంత్రం దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీకున జరుపుకుంటా ఈరోజు మన దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన రోజు 1947లో ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మన దేశం బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందినది అని తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వంటి గొప్ప నాయకులు మన స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మనకు స్వచ్ఛ ను ఇచ్చారు మనం ఈరోజు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాంధవి. ఉపాధ్యాయులు విజయరాణి.సానియా. జ్యోతి. అక్షయ. పూజ. స్వప్న. ప్రవనిత. సుమతి. శోభారాణి. సరస్వతి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: