ములుగు ఎస్పీ శబరీష్ మావోయిస్టుల లేఖపై స్పందిస్తూ, కర్రె గుట్టలపై బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటన విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని అడ్డుకోవడం నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఆదివాసీల క్షేమం కోసం పోలీసులు ఎల్లప్పుడూ పనిచేస్తారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశామని ఎస్పీ తెలిపారు. తమ రక్షణ కోసం అమర్చిన బాంబుల వల్ల ఇతరులు గాయపడవద్దని, పోలీసుల మాటలు నమ్మి ఎవరూ అటువైపు రావొద్దని మావోయిస్టులు హెచ్చరించారు.


ఈ నేపథ్యంలో ములుగు ఎస్పీ శబరీష్ స్పందిస్తూ మావోయిస్టుల చర్యలను ఖండించారు. అమాయక ఆదివాసీలను బాంబులు పెట్టి చంపేస్తూ వారిని ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆదివాసీలు ఎవరికీ భయపడొద్దని, పోలీసులు వారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రె గుట్టలు సుమారు వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంది. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత నిర్బంధం పెరగడంతో మావోయిస్టులతో పాటు వారి సానుభూతిపరులు కూడా పెద్ద సంఖ్యలో కర్రె గుట్టల్లో తలదాచుకుంటున్నారు. అయితే, గుట్టలపైకి వెళ్లి మావోయిస్టులపై దాడులు చేయడం జవాన్లకు ప్రమాదకరమని భావిస్తున్న నేపథ్యంలో, మావోయిస్టులు కిందకు దిగి వస్తారని పోలీసులు ఎదురు చూస్తున్నారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: