మామునూరు నాలుగో బెటాలియన్ ఆవరణలో మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జాగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో (ఇంచార్జి కమాండెంట్) అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పి. కృష్ణ ప్రసాద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ గారు బెటాలియన్లో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి అసిస్టెంట్ కమాండెంట్ గారు మాట్లాడుతూ బాబు జాగ్జీవన్ రామ్ గారు బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పాటుబడిన మహానాయకుడు.సామాజిక సమానత్వం పై అందరినీ చైతన్యపరిచేందుకు 1934లో అలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారని, ఇతను పార్లమెంట్ సభ్యుడు మరియు భారత ప్రభుత్వంలో కాబినెట్ మంత్రి గా కూడా పనిచేసారు.భారతదేశ స్వాత్రంత్ర ఉద్యమం లో కీలకంగా పని చేసారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రవి, పురుషోత్తం రెడ్డి, వెంకటేశ్వర్లు,రాజ్ కుమార్, అశోక్, కృష్ణ, అధికారులు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: