హన్మకొండ ;
విధులను బాధ్యతతో నిర్వహించి ఉద్యోగ శిక్షణ పొందాలని ప్రిన్సిపాల్ శరదృతి అన్నారు.
వరంగల్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం
చదువుతున్న విద్యార్ధినులను
కళాశాల ప్రిన్సిపాల్ శరధృతి సోమవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కి పంపించారు. ఇంటర్మీడియట్
ఒకేషనల్ చదువుతున్న విద్యార్ధినులకు నెల పదిహేను రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. కళాశాల అధ్యాపకురాలు శ్వేత ఆధ్వర్యంలో ఎంజీఎం కు శిక్షణ నిమిత్తం పంపించారు. శిక్షణ కు ఎంజీఎం ఆసుపత్రి కి వెళుతున్న విద్యార్థి నులకు ప్రిన్సిపాల్ శరదృతి పలు సలహాలు సూచనలు చేశారు. రోగుల పట్ల వినయ విధేయతలతో మసలుకోవాలని,బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల, ప్రవళిక,అధ్యాపకులు శ్రీనివాసశర్మ,హరికృష్ణ ,డాక్టర్ కరుణశ్రీ,కవిత,హేమలత, మనోహర్,షబానా,శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: