ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యత కలిసి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ వసతి గృహంలో 250 మంది బాలురకు వసతి కల్పించబడినది. ఈ వసతి గృహ నిర్మాణ వ్యయం రూపాయలు 2.15 కోట్ల రూపా యలు. ఈ వసతి గృహంతో కలిపి
హనుమకొండ లో 6 గిరిజన వసతి గృహాలు బాలురకు 4 బాలికలకు 2 ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమలత, స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూప రాణి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: