ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతిని వెలిగించిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి , ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డిఆర్ఓ వై. వి. గణేష్,సోషల్ వెల్ఫేర్ డిడి నిర్మల, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: