జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో గ్రేహౌండ్స్ కమాండో (కానిస్టేబుల్) ప్రవీణ్ మరణించారు. అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కరెంట్ తీగలు పెట్టిన వారిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

Post A Comment: