ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;సుబేదారిలోని ప్రభుత్వ బాలిక సధన్ లో క్రిస్టమస్ ను పురస్కరించుకొని సెమీ క్రిస్టమస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో మాట్లాడుతు ఇక్కడ ఉన్న పిల్లలు కేవలం అనాథలే కాదు సింగిల్ పేరెంట్ , విడాకులు తీసుకున్న తల్లి తండ్రుల పిల్లలు కూడా ఉన్నారు అని, ప్రభుత్వం ద్వారానే ఈ సదన్ నడిపిస్తున్నామని , వారి ఉజ్వల భవిష్యత్తు కి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ విద్యను అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త I.A.S పిల్లలతో కలిసి క్రిస్టమస్ వేడుక పాటలు పాడి, కేకే కటింగ్ లో పాల్గొన్నారు. పిల్లలకి తమ జీవితం పట్లా ఆశయాలు ఉండాలని , వాటి కోసం కస్టపడి చదవాలని ఎన్నో అవరోధాలను అధిగమించాలని సందేశాన్ని ఇచ్చారు.
అనంతరం శాలువా తో సన్మానించిన అధికారులు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మధురిమ, చిల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డా. పరికి సుధాకర్ , రాజేంద్ర ప్రసాద్ , డి.సి.పి.ఓ సంతోష్ కుమార్ , పి.ఓ.లు ప్రవీణ్ కుమార్ , మౌనిక , సూపరింటెండెంట్ కల్యాణి ,రజిత , మాధవి , శ్రీనివాసులు, విజయ్ కుమార్, సతీష్ కుమార్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: