చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


ప్రధాని నరేంద్ర మోడీఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నీతివంతమైన పరిపాలన బిజెపితోనే సాధ్యమని స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో 9,10,11 వార్డుల పరిధిలో భారతీయ జనతా పార్టీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి ఫోర్ లీడర్ పోలో శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, బిజెపి పార్టీ ద్వారానే తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. 30 తారీఖున జరిగే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్

అధ్యక్షులు వెంకటేశం గౌడ్, చలమల వినయ్ రెడ్డి, గోశిక పురుషోత్తం,

తడక సురేఖ, గోశిక భావన రుషి, ధనుంజయ, నీరజ, భాస్కర్ అక్కనపల్లి

శివ, నరహరి సంపత్,హరీష్, ప్రవీణ్,

తదితరులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: