ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉత్సాహవంతమైన యువ ఓటర్స్ కు 19న ఆదివారం క్రికెట్ మ్యాచ్ కార్యక్రమం జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల తెలిపారు.
శుక్రవారం నాడు ఆమె జెఎన్ఎస్ గ్రౌండ్ లో మ్యాచ్ ఏర్పాట్లు పై అధికారులతో కలసి పరిశీలంచారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి యువతకు అవగాహన కల్పించే స్వీప్ కార్యక్రమంలో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల మద్యనా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ ఉదయం 7 నుండి 11 గంటల మధ్య జరుపబడుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన యువ ఓటర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భాగస్వామ్యాన్ని పెంచేందుకు వరంగల్, హనుమకొండ యువ ఓటర్లు, అధికారులుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓటు ప్రాధాన్యతను వివరించడం వరకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
.ఈ కార్యక్రమం లో జిఎం ఇండస్ట్రీస్ హరి ప్రసాద్, డిపిఓ జగదీశ్ స్పోర్ట్స్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: