ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఈవీఎం, వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని నూతన అదనపు కలెక్టర్  సిహెచ్.  మహేందర్ జీ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వివి ప్యాట్ ల ప్రదర్శన కేంద్రాన్నిఅదనపు కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఈవీఎం, వివి ప్యాట్ ల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు . వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానం పై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలనీ సిబ్బందికి సూచించారు.  ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు https://www.nvsp.in పోర్టల్ లో తమ ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం లో S.కిరణ్ ప్రకాష్ ఏఓ కలెక్టరేట్, ఎం. జ్యోతి వర లక్ష్మీదేవి, సూపరింటెండెంట్,

ఇవి శ్రీనివాస్ రావు ఐఎన్టీయూసీ సి,

కుసుమ శ్యాంసుందర్ టిడిపి, జయపాల్ రెడ్డి బిజెపి, 

నాగవల్లి రజినీకాంత్ వైఎస్సార్,

ఎండీ సయ్యద్ ఫయాజుల ఎంఐఎం,  ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: