మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరంలో ఈరోజు తెలంగాణ ట్రైని ఐఏఎస్ అధికారులు ఉమాశంకర్, అమిత్, కిరణ్మయి, శ్రద్ద, శ్రావణమాసం పురస్కరించుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, దేవాలయం కు రాగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ ఆధ్వర్యంలో, వారిని ఆలయ అర్చకుల బృందం రాజగోపురం నుండి మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి, గర్భాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పాలాభిషేకం పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయం లో అర్చన, దర్శనం, అనంతరం ఆలయ కార్యిర్వహణాధికారి మహేష్, ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, బండి రాజయ్య స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించారు.అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, మహాదేవపూర్ డిటి కృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: