మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజా గర్జన బహిరంగ సభ కు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి 500 మందికి పైగా సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ఎన్.టి.పి.సి కాంట్రాక్టు కార్మికులు, కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికులు, ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గోనేందుకు రామగుండం రైల్వే స్టేషన్లో 22 బోగిలలో వెళ్ళడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజలను, కార్మికుల ను అనేక అవస్తలు పెడుతుందని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడానికే ఈ ప్రజా గర్జన ఉద్దేశం మని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ చలో కొత్తగూడెం కార్యక్రమం లో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మాదన మహేష్, సంకే అశోక్, ఎస్. వెంకట్ రెడ్డి, బుర్ర భాస్కర్, బోగ సతీష్ బాబు, పి.నాగేంద్ర కుమార్, జి.ప్రభుదాస్, ఎం.సంపత్, బండి మల్లేశ్, తాని రాజబాబు, ఆర్.వెంకటస్వామి, తాల్లపెల్లి మల్లయ్య, ఇనుముల రాజమౌళి, మడికొండ ఓదెమ్మ, ప్రీతం, ఉప్పులేటి తిరుపతి, మానాల శ్రీనివాస్, పర్లపెల్లి రామస్వామి, శనగల శ్రీనివాస్, ఆర్ లక్ష్మణ్, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తో పాటు సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: