మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పరికిపండ్ల నరహరి,ఐఏఎస్ నిర్మించిన ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి ద్వారా శంకర ఐ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ కి వెళ్తున్న 30 మంది పేషంట్స్.పరికిపండ్ల నరహరి,ఐఏఎస్ తండ్రి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారయణ సంస్మరణ ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి హాస్పిటల్ ఏప్రిల్ 10,2023 న అతిరథ మహారథులచె ప్రారంభం అయినది.
గత రెండు నెలల నుండి కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వందలాది మంది హాస్పిటల్ కి రావడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక పరికరాలతో వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి,అందులో 30 మందికి శస్త్ర చికిత్స చేయవల్సిన అవసరం ఉందని గుర్తించారు.వారిని ఈరోజు బసంతనగర్ నుండి శంకర ఐ ఫౌండేషన్ సహకారంతో ఉచిత శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ లోని నార్సింగి శంకర విజన్ సెంటర్ కి వెళ్తున్న బస్సుని నరహరి ఐఏఎస్ తల్లి సరోజనమ్మ జండ ఊపి ప్రారంభించారు.కంటి చూపు సమస్యతో బాధపడుతున్నవారు ఎవరైనా రాన్నున్న రోజుల్లో ఉచిత శస్త్ర చికిస్త ఉపయోగించుకోవచ్చు అని పరికిపండ్ల నరహరి తల్లి తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు పరికిపండ్ల రాము,కీర్తి నాగార్జున,కన్నం వెంకటేష్,బొల్లు రమేష్, పరికిపండ్ల సుమంత్, తువ్వ శ్రీకాంత్, కొమ్మ హరీష్, ఆడేపు సుందర్, కటుకూరి భార్గవ మరియు ఆలయ ఫౌండేషన్ కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: