మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హైదరాబాద్:
ధరణి వచ్చాక భూ సమస్యలు మరింత పెరిగాయని వైఎస్ షర్మిల శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృష్టికర్త కేసీఆర్ అన్నారు. రైతులకు మేలు కన్నా తీవ్ర అన్యాయమే జరిగిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్ వల్ల రైతులను 50 రకాల సమస్యలు వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 లక్షల ఎకరాల సాగు భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆమె మండిపడ్డారు. పాస్బుక్ కలర్ మారిందే తప్ప.. ధరణితో ఒరిగిందేమి లేదని విమర్శించారు. ధరణితో 20 లక్షల మంది రైతులకు తప్పని తిప్పలొచ్చాయన్నారు..
Post A Comment: