మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఏ ఐ కె యమ్ ఎస్  నూతన కార్యవర్గం ఎన్నిక "అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏ ఐ కె యమ్ ఎస్)" జనరల్ కౌన్సిల్ (రెండవ రోజు) సమావేశంలో పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది, 

      *నూతన కార్యవర్గం

జిల్లా అధ్యక్షులుగా  మేరుగు చంద్రయ్య (అంతర్గాం మండలం పెద్దంపేట ), జిల్లా ప్రధానకార్యదర్శిగా  వెల్తురు సదానందం (కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి),జిల్లా ఉపాధ్యక్షులుగా  కొల్లూరి మల్లేష్(బ్రాహ్మణపల్లి), దోనూరి రాజమౌళి(ధర్మారం), జిల్లాసహాయ కార్యదర్శిలు గా  వేల్పుల సాంబయ్య (పొట్యాల), పి రమేష్ (రామగిరి మండలం), కోశాధికారిగా తమ్మనవేణి రాజాకొంరయ్య(అంతర్గాం), కార్యవర్గ సభ్యులుగా జక్కుల తిరుపతి(మారేడుగొండ), ఎడ్ల బాబు(ఓదెల మండలం), ఎం డీ బాబన్న(పెద్దపల్లి మండలం), లింగంపల్లి శంకర్(మద్దిర్యాల), పి రాములు(ఎల్కలపెల్లి పాతగేటు), ఎండీ. బషీర్(కుక్కల గూడూరు), M రమేష్, B కుమారస్వామి(సెంటనరీ కాలనీ), ని ఎన్నుకోవడం జరిగింది, *అనంతరం ఈ క్రింది తీర్మాణాలు చేయడం జరిగింది.      

1) పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, రైతులకు సబ్సిడీగా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు ఇవ్వాలి. 

2) రైతులకు ఇచ్చిన రుణాలను ఒకే దఫాలో మాపి చేస్తూ కొత్త రుణాలు ఇవ్వాలి. 

3) కౌలు రైతులను గుర్తిస్తు రుణ అర్హత కార్డులు ఇస్తూ రైతు బందు అమలుచెయ్యాలి. 

4) రైతుకు ప్రభుత్వ పథకాల్లో ప్రియార్టీ ఇవ్వాలి.

5) దేశంలో, రాష్ట్రంలో అమలు ఆవుతున్న రైతు వైతిరేక విధానాలను ఆపివేయాలి.

6) ఎరువులు  విత్తనాల కల్తీ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

7) తొలకరికి ముందే యూరియా, ఇతర ఎరువులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలి. బ్లాక్ మార్కెట్ విధానాన్ని అరికట్టాలి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: