ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రంగశాయిపేటలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారుల ఇండ్లకు వెల్లి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం అందజేసారు. నాయుడు పంప్ కు చెందిన తప్పెట్ల స్వర్ణలత 1,50,000/- రూపాయల, శంభునిపేటకు చెందిన బత్తిని గణేష్ 24,000/- రూపాయలు, రజియా 17,500/- రూపాయల విలువ చేసే చెక్కులను వారికి అందజేసారు.
ఈ కార్యక్రమంలో పోశాల పద్మ స్వామి గౌడ్, బోగి సువర్ణ సురేష్, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: