జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రవి తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపిసి నుండి మచ్చిక సాయి తేజ 984, మొహమ్మద్ సాబీర్ పాషా 963, ఎంపీసీ నుండి ఎస్. వివేక్ 948, ఎండి వసీం అహ్మద్ 945 ప్రథమ సంవత్సరం ఎంపీసీ నుండి ఎండి. రియాన్ 416, జి.రాజ్ కుమార్ 405, బైపిసి నుండి ఎండి.అత్తఉర్రహ్మాన్ 356 సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజ్ కుమార్ ,శేఖర్ ,సుధాకర్, కృష్ణ, ముస్తఫా గీతారాణి వార్డెన్ షేక్ వలి పాషా పాల్గొన్నారు.
Post A Comment: