హన్మకొండ ;

అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్ర మం వాల్ పోస్టర్లను కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం ఆవిష్కరించారు.    జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే. వెంకటరెడ్డి లు పాల్గొన్నారు. జనాభా లెక్కల మాదిరిగానే పశు సంవర్ధక శాఖ పశు గణన కార్యక్ర మాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకు ఒకమారు పశువులను లెక్కిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 21వ అఖిల భారత పశు గణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది . గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద అత్యంత కీలక మని కేంద్ర ప్రభుత్వ భావిస్తోంది. మానవ జీవన శైలిలో శాస్త్ర సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ అదిక శాతం వ్యవసాయ అనుబంధ రంగంతో జీవనోపాది పొందుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి పశువుల గణన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 21వ అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు పొందించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాలలో పశు గణను పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 56 పశు వైద్యశాలలు ఉన్నాయి. వా టిలో రెండు ఏరియా వెటర్నరీ వైద్యశాలలు (ఏవీహెచ్), 23 ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీఏసీ), 31 పశు సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడు జిల్లాలో రెండు   సంచార పశు వైద్య శాలలు పనిచేస్తున్నాయి. జిల్లా వ్యా ప్తంగా మంజూరైన 155 వివిధ స్థాయిల సిబ్బందికి గా ను సుమారు 113 మంది పనిచేస్తున్నారు. ఆయా పరిది లో ఉన్నతాధికారులు ఎంపిక చేసిన 20 సూపర్వైజర్లు, 68             ఎన్యుమరేటర్ల ఆధ్వర్యంలో ఈ పశుగణన చేపట్టనున్నారు.. జిల్లాలో సుమారు 5,85,193 గొర్రెలు, సుమారు  1,27,818 గోజాతి పశువులున్నట్లు అంచనా ఉంది. రెవెన్యూ గ్రామం యూనిట్ గా పశు గణనను జరుపుతున్నారు. పశు గణన డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ (భారత్ పశుదాన్ పోర్టల్)  సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. జిల్లాలో  138 రెవెన్యూ గ్రామాలతో పాటు పట్టణాల్లో గల 57 వార్డులలో  68 మంది ఎన్యుమరేటర్లను గుర్తించి పశు గణన జరుపుతున్నారు. ఎన్యూ మరేటర్ల పనితీరు ను మండల స్థాయిలో సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు . ఇందుకు మండలానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లకు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 25వ తేదీ నుంచి పశుగణన చేపట్టారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు పశు గణన కొన సాగనుంది. పశు వైద్య శాలల డాక్టర్లు సూపర్వైజ ర గా, గోపాల మిత్రులు,పారా స్టాఫ్ ఎన్యుమరేటర్లుగా ఈ పశుగణన కార్యక్రమం ప్రారంభించారు.డాక్టర్లు పశు గణన పర్యవేక్షిస్తున్నారు . ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్ల వెళ్లి పలు అంశాలపై ఆరా తీసి వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయాల్చి ఉంది. తెల్లజాతి పశువులు, నల్లజాతి పశువులు తో పాటు గొర్రెలు, మేకలు,పందులు, కుక్కలు, కోళ్లు ఇతర పెంపుడు జంతువులు వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ రైతు పేరు,ఇంటి సంబర్, ఫోన్ గంబర్, పశుపుల వివరాలతో పా టు వాటి వయస్సు ఇతరత్రా వివరాలను డిజిటలైజేష ద్వారా పోర్టల్లో నమోదు చేస్తున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో  అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్ర మం వాల్ పోస్టర్లను కలెక్టర్ ప్రావిణ్య   జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే. వెంకట్ నారాయణ, జిల్లా ఉప పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి శ్రీనివాస్ ఆవిష్కరించారు. డాక్టర్స్ ప్రవీణ్, దీపిక, వినయ్, విక్రమ్,   పార్థసారథి   పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. పశు గణన ను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లాలని గణన ప్రాధాన్యత ను వివరించాలని ఆదేశం చారు. వాల్ పోస్టర్లను పశువైద్యశాలల ఎదుటు సంబంధిత కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేస్తున్నా రు.

  ఈ గణనతో పశువుల లెక్క పక్కాగా తేలనుంది. దీనిని ఆధారంగా చేసుకుని సంబంధిత వ్యాక్సిన్లు, ప్రభుత్వ సబ్సిడీ దానా తదితర వాటిపై ప్రభుత్వాలు సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నాలుగు నెలల పాటు గణన జరుగుతుంది. సర్వేకు అన్ని గ్రామాల రైతులు సహకరించాలని కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: