భూవివాదంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓదెల మండలం జీలకుంటలో జరిగింది. పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన వంగల శ్రీకాంత్రెడ్డి (35) అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు భూ సమస్య విషయంలో బెదిరింపులకు గురిచేశారు. దీంతో మనోవేదన చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపడ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Post A Comment: